తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్వర్యంలో తొలిసారి తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు 2024
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్వర్యంలో తొలిసారి తెలుగు జర్నలిస్టులకు ‘ ప్రతీ ఏటా ఉగాది పురస్కారాలు’ అందించే బృహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేసేందుకు సంతోషంగా ఉంది. సమాజాన్ని కలంతో ఎంతగానో ప్రభావితం చేసి, జర్నలిజంలో తమ నైపుణ్యం, ప్రతిభతో చెరగని ముద్ర వేసిన తెలుగు జర్నలిస్టులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారిని గౌరవించడం, సన్మానించడం మా బాధ్యతగా భావిస్తున్నాం.
Downloard Now More Images Link Below
యూనియన్ కర్తవ్యాలు-లక్ష్యాలు
- 'జర్నలిజం అంటే వృత్తి కాదు, సామాజిక బాధ్యత' అని భావిస్తుంది తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం. ఐక్యత - సంక్షేమం - భరోసా నినాదాలతో ఏర్పాటైన "తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం" ప్రధానంగా జర్నలిస్టుల భద్రత, మీడియా స్వేచ్ఛ కు, సంక్షేమానికి కృషి చేస్తుంది.
- 1) జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను పెంచేందుకు శిక్షణ తరగతులు, మానసిక పునరుత్తేజానికి సైకాలజీ నిపుణులచే తరగతులు
- 2) నిత్యం సమాజసేవలో పరితపించే జర్నలిస్టుల కోసం ప్రమాద భీమా కల్పించడం, ఆరోగ్య భీమా కు ప్రయత్నం
- 3) జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి 'జర్నలిస్ట్ కార్పొరేషన్' ని ఏర్పాటు చేపించడం
సభ్యత్వం పొందేందుకు అర్హతలు :
- తెలుగు జర్నలిస్ట్ అయి ఉండాలి.
- ప్రభుత్వ లేదా సంస్థ గుర్తింపు కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి.
- ఇతర జర్నలిస్ట్ సంఘాలలో క్రియాశీలక సభ్యులు అయి ఉండకూడదు
- మన సంఘం ను గౌరవిస్తూ, నియమాలను తప్పకుండా పాటించాలి.
- ప్రస్తుతం ఏదైనా ఒక ఆర్.ఎన్.ఐ కలిగిన పత్రికలో లేదా బ్రాడ్ కాస్టింగ్ కలిగిన ఛానెల్ లో పనిచేసే వారై ఉండాలి, ఏ విభాగం అయినా పర్లేదు.
- సభ్యత్వ రుసుము -రూ. 999/- (సభ్యత్వం 500 + సంఘం తరఫున చేసే కార్యక్రమాల కోసం రూ 499)
కావల్సిన ధ్రువపత్రాలు
- ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు : 2
- పాస్ పోర్ట్ ఫోటోలు : 2
- గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీ - 1
- పాన్ కార్డు జిరాక్స్ కాపీ - 1
సభ్యత్వం ద్వారా మీకు ఉపయోగాలు :
ఈ ఇన్సురెన్సు వలన ఉపయోగాలు
- ప్రమాదవశాత్తు మరణం లేదా అంగవైకల్యం రూ.20 లక్షలు
- ఎయిర్ అంబులెన్స్ (గరిష్టంగా) రూ.2 లక్షల వరకు (విమాన లేదా ఇతర వాయు ప్రయాణం)
- రోడ్ అంబులెన్స్ (గరిష్టంగా) రూ.10,000/- వరకు
- యాక్సిడెంటల్ మెడికల్ ఖర్చులు - గరిష్టంగా రూ.2లక్షలు
- ఆసుపత్రి కి నగదు (30 రోజుల వరకు) రోజుకు రూ. 500/-
- పిల్లల విద్య ప్రయోజనం (గరిష్టంగా ఇద్దరు పిల్లలకు) రూ.20,000/- వరకు
- గృహ మార్పు/ వాహన సవరణ రూ.50,000/- వరకు
- రూ.10,000/- వరకు పెండింగ్ బిల్లుల బాధ్యత.
- రూ.50,000/- వరకు వివాహ ఖర్చులు.
- రూ.10,000/- వరకు దహన ఖర్చులు
- (గమనిక : సంస్థ నియమ నిబంధనలు వర్తిస్తాయి.)
- తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యులుగా గుర్తింపు కార్డు (జిల్లా కమిటీ అధ్వర్యంలో అందజేయబడుతుంది)
- ఉచితంగా జీరో బ్యాలెన్స్ బ్యాంకు అకౌంట్
- రూ .20 లక్షలు ప్రమాద భీమా మరియు కొన్ని అదనపు ప్రయోజనాలు
- ప్రైవేటు విద్యా సంస్థలలో జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత లేదా 50 శాతం ఫీజు రాయితీ కి కృషి
- అత్యవర పరిస్థితుల్లో వైద్య ఖర్చులకు రూ.10 వేలు ఆర్థిక సాయం
- అకాల మరణం చెందిన జర్నలిస్టులకు మట్టి ఖర్చులకు రూ.10 వేలు సాయం.
- నూతన జర్నలిస్టులకు శిక్షణ తరగతులు
- అవకాశాన్ని బట్టి వైద్యం, విద్య కొరకు సహకారం.
- కలం వృత్తిలో సమస్యలు ఎదురైతే సంఘం తరపున న్యాయ సహకారం.
- అనుభవం తోపాటు చురుకుగా వ్యవహరించే వారిని ప్రోత్సహిస్తూ సంఘంలో గౌరవ స్థానం కల్పించడం.
Join Now
[form id="5492"]
Support Us
Telugu Journalistula Samkshema Sangham
Account Number : 1726104000117289
IFSI code : IBKL0001726
IDBI Bank, Narasaraopet Branch.
ప్రతీ ఒక్కరికీ సొంత ఇల్లు అనేది ఒక కల..ఒక భరోసా. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని జర్నలిస్టులకు కూడా సొంత ఇల్లు అనేది చిరకాలవాంఛగా మిగిలిపోయింది. ‘జర్నలిస్టులకు 3 సెంట్లు ఇళ్ళ స్థలం’ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని మంత్రి మండలి ఆమోదించడం, వెనువెంటనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం శుభపరిణామం. ఇది నిజంగా.. జర్నలిస్టులకు సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి తొలిమెట్టు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జర్నలిస్టుల కుటుంబాల్లో వెలుగు నింపే గొప్ప నిర్ణయం. సగటు జర్నలిస్టుల జీవన పరిస్థితులను మెరుగుపర్చేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది.
స్వతహాగా జర్నలిస్టుల సమస్యలు తెలిసిన ముఖ్యమంత్రిగా జర్నలిస్టుల శ్రేయస్సు కోరుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ.. అందరికీ మంచి చేసే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి, మంత్రులకు రాష్ర్టంలోని జర్నలిస్టుల తరఫున ‘తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం’ నుండి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి గారు జర్నలిస్టులకు సొంతింటి కలను సాకారం చేయడంలో ఎంతగానో కృషి చేశారు. ఆయన చేసిన మేలుతో ఈరోజు ఎంతోమంది జర్నలిస్టులు సొంతింటి కలను సాకారం చేసుకుని ధైర్యంగా జీవిస్తున్నారని చెప్పడానికి గర్వపడుతున్నాము. ప్రస్తుతం ఆయన తనయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు “జర్నలిస్టులకు 3సెంట్లు ఇంటి స్థలం ” ప్రకటించి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఈ కారణంగా “నాడు వైయస్ఆర్ గారు నేడు జగన్ గారు చరితార్థులు.”























